- చాడ కారును ధ్వంసం చేసిన ఇద్దరు దుండగులు
- ఆర్ఎ్సఎస్, బీజేపీ వారి పనే: సీపీఐ
హైదరాబాద్/హిమాయత్నగర్ : హిమాయత్నగర్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్పై ఆదివారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం సెలవుదినం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల హడావుడి లేని సమయంలో సాయంత్రం 6.30 గంటలకు మోటారుసైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు తెలుగు అకాడెమీ చిరునామా అడిగినట్టుగా నటించి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కారుపై కర్రలతో దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. మక్దూం భవన్ సెక్యూరిటీ గార్డు సురేందర్.. కొందరు సీపీఐ కార్యకర్తలను పిలిచేసరికి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
దాడి విషయం తెలిసిన వెంటనే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అక్కడికి చేరుకున్నారు. రాజకీయ కక్షతో దాడి జరిగిందని, దీనికి బీజేపీ, ఆర్ఎ్సఎ్సకు చెందిన మత ప్రేరేపిత శక్తులే కారణమని ఆరోపించారు. 74 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో పార్టీ కార్యాలయంలో దాడి ఎన్నడూ జరగలేద ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.
Courtesy Andhrajyothi