కృష్ణా జిల్లా కైకలూరులో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించిన జిల్లా SP శ్రీ రవీంద్ర బాబు గారు,
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో కోవిడ్ బాధితులకు అత్యవసరసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేస్తుందని కృష్ణా జిల్లా ఎస్.పి రవీంద్రనాధ్ బాబు అన్నారు.
కైకలూరు నియోజకవర్గ స్థాయి కోవిడ్ హాస్పిటల్ ను ఈ రోజు ఉదయం గం.10.50 ని.లకు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) గారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా SP రవీంద్రబాబు గారు MLA గారు స్థానిక CHC లో కోవిడ్ హాస్పిటల్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా SP రవీంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి YS జగన్మోహనరెడ్డి గారి ఆదేశాలతో స్థానిక శాసనసభ్యులు DNR గారి కృషితో ఈ రోజు కైకలూరు పట్టణంలో నియోజకవర్గం స్థాయి కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అని అన్నారు. కరోనా రెండవ దశ చాలా భయంకరంగా వుంది అని అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దు అని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కర్ఫ్యూ సమయంలోనూ, అలాగే సడలింపు సమయంలోనూ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని అన్నారు.
కైకలూరు ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక కోవిడ్ ఆసుపత్రి ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కావలసిన గదులను, టాయిలెట్లను, ఆక్సిజన్ పైపు లైన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఇకపై కైకలూరు ప్రాంత కోవిడ్ బాధితులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, 25 పడకల ఆక్సిజన్ కోవిడ్ సెంటర్ మనకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వ్యక్తిగత జాగ్రత్తలు ఎవరికి వారు తీసుకుంటే కోవిడ్ ను కట్టడి చేసే అవకాశం చిక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని హాస్పిటల్ ను ప్రారంభించిన జిల్లా ఎస్.పి రవీంద్రనాధ్ బాబు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో కోవిడ్ హాస్పిటల్ ఇంచార్జ్ డాక్టర్ వేణుగోపాల్, DSP సత్యానంద్, CI. YVVL నాయుడు, సర్పంచ్ D. M. నవరత్నకుమారి, SI. లు షణ్ముఖసాయి, గాయత్రి, రామకృష్ణ, చల్లా కృష్ణ, డాక్టర్స్ ఆదిలక్ష్మి, ప్రశాంతి, శంకర్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబెర్స్ D.V.శ్యామ్ ఫణికుమార్, శ్యామల, MPDO వెంకటరత్నం, EO లక్ష్మినారాయణ, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూనవరపు సతీష్ మంగినేని రామకృష్ణ, అబ్దుల్ హమీద్, గరికిముక్కు జాన్ విక్టర్, గండికోట ఏసుబాబు, సాన రాము, చిట్టూరి వాసు, నిమ్మల సాయిబాబు, ఉప్పలపాటి జయదేవ్, చేకూరి బలరామరాజు, జక్క శివాజీ, తలారి జాన్ విల్సన్, సయ్యద్ బాషా, విజయ్ కుమార్ వంగలపూడి, మదన్ కుమ్మరికుంట, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Covid Hospital Inaugurated by Krishna District SP Sri Ravindranadh Babu I.P.S and Kaikaluru MLA Sri Dulam Nageswara Rao garu at Kaikaluru Community Health Center.