న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య దారుణంగా ఉన్నట్టుగా ఒక నివేదికలో వెల్లడైంది. భారత్లోని ప్రధాన కంపెనీల్లోని 53 సంస్థల్లో పురుష- స్త్రీ ఉద్యోగుల నిష్పత్తి 10:1 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉన్నట్టుగా కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ వాచ్ (సీఆర్డబ్ల్యు) నివేదికలో వెల్లడైంది. ప్రధాన కంపెనీల్లో దాదాపు 70 శాతం కంపెనీల్లో దివ్యాంగులైన ఉద్యోగుల సంఖ్య ఒక శాతం కంటే కూడా తక్కువగా ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశంలోని 300 ప్రధాన కంపెనీలలో కేవలం 39 సంస్థలు మాత్రమే తమతమ కంపెనీల్లో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, వోబీసీల వివరాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చినట్టుగా ఈ నివేదిక వివరించింది. మొత్తం కంపెనీలలో కేవలం 103 కంపెనీలు మాత్రమే మహిళా ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించగా.. మిగతా కంపెనీలు ఇందుకు నిరాసక్తతను కనబరిచాయి. మొత్తం దేశంలో వివిధ కంపెనీలు అందిస్తున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం నిధుల్లో అత్యధికం అంటే దాదాపు రూ.2,482.75 కోట్లు మహారాష్ట్రకుఅందినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలకు కేవలం రూ.29.9 కోట్లు మాత్రమే సీఎస్ఆర్ గ్రాంట్ల కింద నిధులు అందినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ వెల్లడించిన నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను 16,785 కంపెనీలు కేవలం రూ.10,065 కోట్ల మేర నిధులను మాత్రమే సీఎస్ఆర్ కార్యక్రమాలకు కేటాయించినట్టుగా తెలిపారు. దేశంలోని కంపెనీలు దాదాపు రూ.23,247.90 కోట్ల మేర నిధులను సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాల్సి ఉండగా సంస్థలు ఇందులో కేవలం 57 శాతం నిధులను మాత్రమే వెచ్చించినట్టుగాతీ నివేదిక తెలిపింది.
Courtesy Nava telangana…