దళితుల పక్షాన నిలిచి, అడుగడుగున దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విదానాలను ఎండగడుతూ, పీడిత దళిత ప్రజలను చైతన్యవంతం గావిస్తున్నదని.
ముఖ్యంగా దళిత మహిళలకు బరోసాను ఇస్తున్నదని తమ అధికార పార్టీలకు దాసోహం చేయటం లేదనే అక్కసుతో దేశ భవిష్యత్ విశ్వవిద్యాలయం విద్యార్థులపై తమ బ్రాహ్మణీయ, మనువాద బావాజాలాన్ని రుద్దడానికి వ్యతిరేఖంగా నిలబడుతూ విద్యార్థుల్లో శాస్త్రియ అవగాహన కల్పిస్తూ, మార్క్స్ పూలే, అంబెద్కర్ల ఆలోచనలను ప్రచారం కావిస్తూ, భూస్వమ్య అవశేషభమైన అగ్రకుల ఉన్మాదాన్ని, తమ ఉపన్యాసాలతో ఎదిరిస్తూ, ఎదిరించేలా విద్యార్థులను తయారు చేస్తున్నదనీ, ఎలాగైనా అణచివేయాలనే దురుద్దేషంతో పగబూనిన కేంద్రంలో అధికారంలలో ఉన్న BJP దాని అనుబంద విద్యార్థి సంఘమైన ABVPతో దాడులు చేయిస్తున్నది. అంతేగాక ఎడుకేషన్ టూర్లకని తీసుకెళ్ళి విద్యార్థులను మావోయిస్టులతో కలిపిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుచున్నాయి

అలాగే ప్రభుత్వ ప్రజావ్యతిరేక ఫాసిస్టు నిర్బంధపూరిత విదానలను ఎండ గడతున్నందున తమను వ్యతిరేకించే వారెవ్వురూ ఉండకూడదనే దానితో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ తప్పుడుగా దుష్ప్రచారం చేస్తూ అణచివెయజూస్తున్నటువంటి పాలకవర్గాల (కేంద్ర -రాష్ట ప్రభుత్వాల) కుటిల నీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం సుజాత గారిపై దాడులకు పూనుకుంటున్న వారు ఎవరో విద్యార్థులు, వివిద రంగాల ప్రజలు చూస్తూనె ఉన్నారు. తప్పడు ప్రచారాలు మాని వాస్తవాల మీద ఆదారపడి మాట్లాడాలే తప్ప అవాస్తవాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ బావపరంగా దాడులు చేస్తూ మేధావులను విద్యార్థులను అణచివేయచూడడాన్ని అన్ని రంగాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు, మేధావులు విద్యార్థులు, ఉపాధ్యాయులు యువజనులు అందర ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (DSO)మరియు భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు) UCCRI(ML) కిషన్ వర్గం సంయుక్త ప్రకటనలో ఇదంతా కేంద్ర-రాష్ట్ర ప్రభూత్వాల కుట్రగా బావిస్తు ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండించాయి.-ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (DSO) రాష్ట్ర నాయకులు అర్శం అశోక్,శరణ్, ప్రృథ్వి, తిరుపతీ, M.అనీల్ కుమార్, మరియు UCCRI-(ML) కిషన్ వర్గం రాష్ట్ర నాయకులు G.సదానందం-94970334
G.Sadnandam