కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని చింతలపూడి గ్రామ సర్పంచ్ గా గెలిచిన కాగిత సూర్యనారాయణ (చంటి) గారు,కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ చింతలపూడి గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే చింతలపూడి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో దోమతోటి శుభకర్, కాగిత వెంకటరమణ, యేసుపాదం, రాణి, అన్నమణి, పద్మ, శివకుమారి యువకులు తదితరులు పాల్గొన్నారు.