- ఐరాసలో చైనా ట్రైబ్యునల్ ఫిర్యాదు
న్యూఢిల్లీ : మనిషి బతికుండగా గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, చర్మం తదితర అవయవాలన్నీ తీసేస్తే..? చైనా ప్రభుత్వం ఇదే పనిచేస్తోందని.. వేలాది మంది నుంచి బలవంతంగా అవయవాలు సేకరిస్తోందని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల కౌన్సిల్లో ఓ ఫిర్యాదు దాఖలైంది. చైనాలో పీడిత వర్గాలైన ఉయ్ఘర్ ముస్లిం, ఫలూన్ గాంగ్ మతస్థుల అవయవాలను చైనా సర్కారు సేకరిస్తోందని సాక్షాత్తు చైనా ట్రైబ్యునల్ ఫిర్యాదు చేసింది. దీనిని చైనా ఖండించింది. మరణశిక్ష పడ్డ ఖైదీల అవయవాలను సేకరించిన మాట వాస్తవమేనని.. దాన్ని నిలిపివేశామని పేర్కొంది.
Courtesy AndhraJyothy..