– మునుపటి ఆదాయం లేక.. అవస్థలు
– కోవిడ్-19 నుంచి దేశం ఇంకా కోలుకోలేదు
– ఆర్థిక రికవరీపై ప్రభుత్వ వర్గాల సమాచారాన్ని నమ్మలేం
– జీతాల్లో కోతల వల్ల.. కొనుగోలు దెబ్బతిన్నది : యూనివర్సిటీ ఆఫ్ చికాగో
లాక్డౌన్ ఎత్తేసాక..నిరుద్యోగం తగ్గిందని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం నమ్మశక్యంగా లేదు. కార్మికరంగంలో నెలకొన్న పరిస్థితి చూస్తే ఇది అర్థమవుతోంది. పాలు, గుడ్లు, మాంసం, చేపలపై తలసరి సగటు వ్యయం ఈ ఏడాది ఏప్రిల్లో 45శాతం పడిపోయింది. వీటికి సంబంధించి అమ్మకాలు ఆగస్టునాటికి కూడా పెరగలేదు. కూరగాయలు, పండ్లు, వంట దినుసుల అమ్మకాలూ పెరగలేదు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కోత, జీతాల్లో కోత కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా కీలకమైన ఆర్థిక సూచికల్లో ప్రతిబింబించటం లేదు.
– ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో’ నివేదిక
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం, కోవిడ్- 19 ఈ రెండింటి కారణంగా సగటు భారతీయుడు తీవ్రమైన ఆర్థికకష్టన ష్టాల్లో కూరుకుపోయాడు. కోవిడ్-19 రాకముందునాటి పరిస్థితుల్ని అందుకో వటం భారతీయులకు ఇప్పట్లో సాధ్య మయ్యేట్టు లేదని ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో’ అధ్యయ నం పేర్కొన్నది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై వస్తున్న అధికారిక సమా చారం సరైందేనా? కాదా? అనే సం దేహాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత… ప్రజల కొనుగోలు సామర్థ్యం ఏమాత్రమూ మెరుగుపడలేదని ఇందులో పేర్కొన్నారు. దీనికి కారణం ఉపాధి, ఉద్యోగ రంగాల్లో జీతాల కోతలే కారణమని, ‘వి’ ఆకృతిలో రికవరీ ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని నివేదిక అభిప్రాయపడింది. వర్సిటీకి చెందిన ‘బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ విడుదల చేసిన పరిశోధన పత్రంలో పై విషయాలు పేర్కొ న్నారు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆర్థిక రికవరీపై అనుమానం!
లాక్డౌన్ ఎత్తేసాక ఉపాధి, ఉద్యోగరంగాలు మెరుగుపడ్డాయని వార్తలు వెలువడ్డాయి. నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరిగాయనీ, ఖరీఫ్ దిగుబడి బాగుందనీ, రైల్, పోర్టు రవాణా పెరిగిందనీ..తద్వారా ఆర్థిక పరిస్థితి కోలుకున్నదని నిర్ధారించారు. అయితే అనేక రంగాల్లో ఉద్యోగులు, కార్మి కులు కోవిడ్-19 ముందునాటి జీతభత్యాలు పొందటం లేదు, వారి ఉపాధి, ఉద్యోగాల తీరు కూడా మునపటి విధంగా కొనసాగటం లేదు. క్రితం ఏడాదితో పోల్చితే పెట్రోలియం ఉత్పత్తుల వాడకం పడిపోయిం ది. పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి క్షీణించింది. ఆగస్టు వరకూ ఇదే పరిస్థి తి ఉంది. ఇలాంటప్పుడు జీఎస్టీ వసూళ్లు ఎలాపెరిగాయన్నది సందేహా లు కలిగిస్తోంది. అలాగే ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా క్షీణించాయి. దీనిని బట్టి భారత ఆర్థిక వ్యవస్థను తెలిపే సూచికలను పూర్తిగా నమ్మ లేం. సగటు భారతీయుల సంక్షోభాన్ని ఇది ప్రతిబింబించటం లేదు.
పరిస్థితి మరోలా ..
నాలుగు నెలలకోమారు దేశవ్యాప్తంగా 1.75 లక్షల కుటుంబాలపై సర్వే చేసి ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ పలు నివేదికలు విడుదల చేస్తోంది. ఇందులో గణాంకాల్ని పరిశీలిస్తే, ఉపాధిరంగం కోవిడ్ ముందునాటి స్థితికి చేరుకోలేదని అర్థమవుతోంది. నిరుద్యోగం తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కార్మికరంగం లో నెలకొన్న పరిస్థితి చూస్తే మరోలా ఉంది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కలిగివున్నవారికీ..మునపటి జీతభత్యాలు లేవు…అని పరిశోధకులు ప్రొఫెసర్ మారియానా, ప్రొఫెసర్ రిబెకా డిజోన్రాస్, కౌశిక్ కృష్ణణ్ చెప్పారు.
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పలు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రం తలకిందులైంది. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ రాష్ట్రాల్లో తలసరి సగటు ఆదాయం 45-55శాతం పడిపోయింది.
Courtesy Nava Telangana