సూరత్ : ఇదో ఏక్షన్ రీప్లే.. గుజరాత్లో జనవరి నెలలో తమ పిల్లల పెళ్లి సంబరాలకు ముందు ‘లేచిపోయిన’ ఓ వధువు తల్లి, వరుడి తండ్రి మళ్లీ అదే పనిచేశారు.సూరత్కు చెందిన హిమ్మత్ పాండవ్(46), నవ్సారీకి చెందిన శోభనా రావల్ పరస్పరం ఆకర్షితులై లేచిపోవడంతో పిల్లల పెళ్లి నిలిచిపోయింది. అయితే కుటుంబ, సమాజ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల క్రితం తిరిగి వచ్చినా ఒకర్నొకరు విడిచి ఉండలేకపోయారు. మూడ్రోజుల క్రితం ఇద్దరూ మళ్లీ లేచిపోయారు.
సూరత్లోనే ఓఇంట్లో సహజీవనం మొదలెట్టేశారు. తొలిసారి వెళ్లిపోయినప్పుడు వారిరువురిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈసారి మాత్రం ఏ కేసూ నమో దు చేయలేదు. తిరిగివచ్చిన తరువాత శోభనను ఆమె భర్త ఇంట్లో అడుగుపెట్టనివ్వకపోవడంతో ఆమె తన తలిదండ్రుల ఇంట్లో ఉండిపోయింది. లేచిపోయిన ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా పెద్దలు వద్దనడంతో ఏం చేయలేకపోయారు.
Courtesy Andhrajyothi