కొవ్వూరు : పశివేదలలో గ్రామ సచివాలయానికి ప్రతిపా దించిన స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దళిత యువకులు ఆటలు ఆడుకోవడానికి నిర్దేశించిన స్థలంలో చేపట్టిన సచివాలయ భవనం నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో శుక్రవారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళితులకు కేటాయించిన స్థలంలో సచివాలయ భవనం నిర్మించడాన్ని బీఎస్పీ నాయకులు తప్పుబట్టారు.