దండి వెంకట్✍
కుల,వర్గ
సిద్ధాంతం
అజేయమైనదని
వర్తమానం రుజువు
పరుస్తున్నది…!!
★ 25 సంవత్సరాల
క్రితమే భారత విప్లవోద్యమానికి
కులమే ప్రధాన
ఆటంకమంటూ
వర్గపోరుకు
సమాంతరంగా
కుల నిర్మూలన పోరాటాలకు
పదును పెట్టాలన్న
“కామ్రేడ్ మారోజు”
శాస్త్రియ ఆలోచన కు
భారత వర్తమాన
రాజకీయ ముఖచిత్రం
రుజువుకు నిల్చింది..!!!
★★★****జరిగి పోయిన దాన్నే చరిత్ర
అంటాము…
ఆ చరిత్రలో జరిగిన విజయాలు,
అపజయాలు
విజేతల వీరగాధలు,
పరాజితుల నెత్తుటి మరకల
ఆనవాళ్లు అన్నింటిని చరిత్ర అనే కాలం తల్లి ప్రతీదాన్ని
తన గర్భంలో దాచుకుంటుంది.
వర్తమానానికి అవసరమైనప్పుడు భవిష్యత్తుకు పనికొస్తుందేమోఅని అందిస్తునేఉంటుంది…
★ ఈ దేశ అగ్రకులఆధిపత్య మూస ప్రగతిశీల
మేధావులు విస్మరించిన
శంభూకుడు,
ఏకలవ్యుడు
భీంమా కోరేగావ్ లాంటి వందలాది చారిత్రక ఆనవాళ్లు
చరిత్ర కాలగర్భంనుండి
వెతికి వెతికి బయటకు తీసినవే….
అలాంటి చారిత్రక నేపథ్య
ప్రాధాన్యత కలిగిన సంఘటనయే
★ “కామ్రేడ్ మారోజు వీరన్న”
రాజకీయ హత్యోదాంతం..
20 సంవత్సరాల
తరువాత
చెదిరిపోయిన సైద్ధాంతిక
సైనికులంతా ఓ చోటచేరిన
సందర్భాన్ని పురస్కరించుకోని
ఈ చిన్న వ్యాసం రాయాలనిపించింది…★★★****
1999 మే 16న ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో
చంద్రబాబు నాయుడి నాయకత్వన
రాజ్యంచే రాజకీయ హత్య చేయబడిన మొట్టమొదటి
శ్రామిక బహుజన కమ్యూనిస్టుపార్టీ నిర్మాత
“కామ్రేడ్ మారోజు వీరన్న”
ఎన్కౌంటర్ హత్య అనంతరం
మారోజు సిద్ధాంత సహచరులంతా చెల్లాచెదురైయిపోయారు…
★ 30-5-2019 నాడు
సుందరయ్యా విజ్ఞాన కేంద్రం హైదరాబాద్
లో జరిగిన
“మారోజు వీరన్న”
వర్ధంతి సభలో
ఆనాటి సిద్ధాంత సహచరులు,
అభిమానులు
ఒకచోట చేరిన సందర్భాన్ని
చూసినప్పుడు గతం జ్ఞాపకాలను ఒక్కసారిగా
అవలోకనం చేసుకున్న
సందర్భాన్ని
ఈ సందర్భంగా నెమరు వేసుకోవాలనిపంచింది….
★1993-4 లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 7 సిపిఐ ఎంఎల్ పార్టీ గ్రూపులు సిపిఐ ఎంఎల్ జనశక్తి పార్టీగా ఆవిర్భావం చెందడాన్ని అనేక మంది మేధావులు స్వాగతించారు.. కూర రాజన్న నాయకత్వన
గోదావరి లోనుండి శ్రీ కాకుళం
కొండమొదలు వరకు
మార్క్సిస్టు-లెనినిస్టు సైద్ధాంతిక పునాదిపై మహోన్నత ప్రజా ఉద్యమాలకు భీజంవేసిన
క్రమానికి ఫూలే,అంబెద్కర్
భారతీయ నమూనా
విప్లవ సిద్ధాంతాన్ని జోడించడం తక్షణ కర్తవ్యమని
మే సెవెన్ట్ కామ్రేడ్స్ పేరుతో
“కామ్రేడ్ మారోజు వీరన్న” నాయకత్వాన
★ ఇండియాలో ఏం చేయాలి
అనే డాక్యుమెంట్ ను
కూరరాజన్న,
రాంచంద్రన్
ల నాయకత్వానికి
మే 17 కామ్రేడ్స్ పేరుతో
రాయడం జరిగింది…
“కామ్రేడ్ మారోజు వీరన్న”
లేవనెత్తిన పాత సమస్యలకు కొత్త సమాధానాలు కావాలంటూ
“కామ్రేడ్ మారోజు వీరన్న”
బృందం లేవనెత్తిన ప్రశ్నలకు
సమాధానం చేప్పలేక చేతులెత్తేసిన మూస నాయకత్వం
ఎదురు దాడి చేసింది..
సాయుధ పోరాట పంధాలో
పనిచేసే మావోయిస్టులు,
పార్లమెంట్ పంధాలో పనిచేసే
వామపక్షాలు,మార్క్సిస్టు మేధావులందరు
“కామ్రేడ్ మారోజు వీరన్న”
సైద్ధాంతిక రాజకీయ దృక్పథ
బృందం సభ్యులను
అవహేళన చేసి మాట్లాడిన మాటలు,వ్యాసాలు ఇప్పటికీ
చరిత్ర తన వద్దా జాగ్రత్తగా
దాచిపెట్టింది…
★ “కామ్రేడ్ మారోజు వీరన్న”
లేవనెత్తిన కుల సమస్యనే
భారత విప్లవోద్యమానికి
ఆటంకం అంటూ శాస్త్రియంగా ఆధారాలతో
చెప్పడాన్ని హేళహళ చేసిన
మార్క్సిస్టులు,
మావోయిస్టులు
ఇప్పుడు వారు
“కామ్రేడ్ మారోజు వీరన్న”
మేధను కాపి ఫేస్ట్ ను
తమ స్వంత మేధాగా చెప్పుకోవడానికి
★ సిపిఎం,సిపిఐ,
ఇతర ఎంఎల్ పార్టీలు
కుల నిర్మూన సంఘం,
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం,
దళిత హక్కుల
పోరాట సంఘం
తదితర ఎస్సీ సెల్లులు
★ ఎంబిసి,బిసి సబ్ ప్లాన్ సంఘాలు ఏర్పాటు చేశారు..
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్
తదితర సామాజిక అంశాలపై
అన్ని కమ్యూనిస్టు పార్టీలు,
వారి మేధావి వర్గం
“కామ్రేడ్ మారోజు వీరన్న” లైన్ ను ఎగతాళి చేసి మాట్లడిన వారే
అనే విషయాన్ని
చరిత్ర జాగ్రత్తగా పదిలపరింధి…
★ 25 సంవత్సరాల క్రితం
“కామ్రేడ్ మారోజు వీరన్న”
కులంపై మతంపై
వ్యక్తం చేసిన అంశాలను
వ్యతిరేకిస్తూ వరంగల్ కేంద్రంలో బిజెపి అనుబంధ సంస్ధలు “కామ్రేడ్ మారోజు”
దిష్టిబొమ్మను దగ్ధం చేశారు
వరంగల్ బంధ్ నిర్వహించారు.
★ పెరియార్ విషయంలో జరిగిందే మారోజు వీరన్న విషయంలో జరిగింది…!
స్వతంత్ర పోరాట కాలంలోనే
పెరియార్ రామస్వామి నాయకర్ గారు
ఆత్మగౌరవ కమ్యూనిస్టుపార్టీ
పెట్టినప్పుడు బ్రిటిష్ వారితో
కలిసి కుట్రచేసిన వారి
వారసులే
“కామ్రేడ్ మారోజు” విషయంలో జరిగింది…
పెరియార్ ను పార్టీ పెట్టకుండా
నియంత్రించగలిగారు…
“కామ్రేడ్ మారోజును” భౌతికంగా నిర్మూలించగలిగారు….
★ కానీ వారు సృష్టించిన
శ్రామిక బహుజన భావజాలం
ఈ భారత భూమిపై విత్తనాల్ల
మొలకెత్తకమానదు..
కొత్త ప్రపంచానికి
దారులు వేస్తుంది…
సమతా మమతల రాజ్యాధినేతను ఏకలవ్యుడి
వారసుడు పాలితుడై
పాలించక తప్పదు….
★★★****
4-6-2019
వీరుడు మరణించిన
అనంతరమే జీవించడం
మొదలు పెడతాడు…