- ఆస్పత్రికి కాకుండా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణం
- కేరళలో ఘటన.. సుమోటోగా తీసుకున్నమహిళా కమిషన్
తిరువనంతపురం: పందొమ్మిదేళ్ల యువతికి కరోనా సోకింది. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు రాత్రికిరాత్రి కుటుంబసభ్యులు అంబులెన్స్ను పిలిపించారు. అందులోకి ఎక్కిన ఆమెను డ్రైవర్ ఓ నిర్జన స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. కేరళలో ఈ ఘోరం జరిగింది. నిందితుడిని 29 ఏళ్ల నౌఫల్గా గుర్తించారు. శనివారం రాత్రి కరోనా సోకిన ఓ వయసు మళ్లిన మహిళను, 19 ఏళ్ల యువతిని అంబులెన్స్లో ఎక్కించుకొని వేర్వేరు ఆస్పత్రిలో చేర్పించేందుకు నౌఫల్ బయలుదేరాడు. పథకం ప్రకారం తొలుత పెద్దావిడను ఆస్పత్రిలో చే ర్పించాడు. అనంతరం అంబులెన్స్లో ఉన్న యువతితో కలిసి బయలుదేరా డు. వాస్తవానికి ఆమెను పతనంతిట్టా లోని ఫస్ట్లైన్ చికిత్స కేంద్రానికి తరలించాలి. అయితే అంబులెన్స్ను డ్రైవర్ నౌఫల్ దారి మళ్లించాడు. పతనంతిట్టా సమీపంలో అరన్ముల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమెను ఫస్ట్లైన్ చికిత్స కేంద్రంలో దిగబెట్టాడు. అక్కడ బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను అడూర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసింది.
నిందితుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎంసీ జోసెఫిన్ పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, నిందితుడి పట్ల కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ నౌఫల్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నౌఫల్, కయంకులం వాస్తవ్యుడని.. అతడిపై గతంలో హత్యా కేసు ఉందని పతనంతిట్టా ఎస్పీ పీకేజీ సిమోన్ చెప్పారు. ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేశా యి. ఘటనపై అత్యున్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
Courtesy Andhrajyothi