కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు కైకలూరు ZPTC శ్రీమతి కురెళ్ళ బేబి గారిని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నిత్యం ప్రజల సేవలో వుంటూ, ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ రోజు కైకలూరు నియోజకవర్గం నుంచి 4 జడ్పీటీసీలు 67 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందటం చాలా ఆనందంగా వుంది అని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.