ముంపునకు గురి అయిన కొల్లేటి గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.
ఈరోజు గుడివాడ RDO జి శ్రీను కుమార్, MRO సాయి కృష్ణకుమారి, ఫిషరీస్ AD వర్ధన్, డ్రైనేజీ DEE శిరీష, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జడ్పీటీసీ అభ్యర్థి కూరెళ్ళ బేబీ, PHC డాక్టర్ వేణు, డా.శంకర్, RWS AEE నాగబాబు , PR AEE బాషా, ఫారెస్ట్ అధికారులు, R&B అధికారులు, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, కొల్లేటి గ్రామాల నాయకులు నబిగారి రాంబాబు,సైదు గాయత్రీ సంతోషి, జయమంగళ కాసులు, SC సెల్ నాయకులు బొడ్డు నోబుల్, VROలు, ఆశ వర్కర్స్, గ్రామ సెక్రటరీలు, పార్టీ నాయకులతో కలసి , కొల్లేరు లంక గ్రామాలు పర్యటించారు.ఈ సందర్బంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో MLA DNR గారు మాట్లాడుతూ ముంపుకు గురి అయిన మీ పందిరిపల్లిగూడెం గ్రామానికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన RDO గారు, ప్రభుత్వ అధికారులు అందరం వచ్చాము అని, మీ అందరికి ప్రభుత్వం తరుపున నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు, వస్తుంది అని, అలాగే మీ యొక్క గ్రామంలో పూర్తిగా శానిటేషన్ చేయిస్తున్నాం అని, మత్యకారులకు ప్రభుత్వం తరుపున సాంప్రదాయ వేటకు, ఎదురు గడలు కూడా ఇస్తాం అని అన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి పశువుల దాణా కూడా వచ్చేలాగా చర్యలు తీసుకుంటాం అని , అలాగే క్రింద గ్రామాల నుంచి రావటానికి ఎవరికీ ఇబ్బందులు లేకుండా రోజూ ముంపు తగ్గేవరకు 3 ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు, షేక్ రఫీ, నిమ్మల సాయి, సతీష్ కూనవరపు, నబిగారి రాంబాబు, కాసులు, మంగినేని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.