పంజా విసురుతున్న క్షయ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెలంగాణలో కొత్తగా 7495 కేసులు

టీబీ కేసుల్లో రాష్ర్టానిది 14 వస్థానం

యూపీలో 4.2 లక్షల మందికి టీబీ

క్షయ నివేదిక-2019 వెల్లడి

తెలంగాణలో క్షయ తీవ్రత నానాటికీ పెరుగుతోంది. 2017లో 44,644 కేసులు గురిస్తే 2018 నాటికి ఆ సంఖ్య 52139కి చేరింది. ఏడాది కాలంలో 7495 కేసులు పెరిగాయి. ఈ విషయాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఇండియన్‌ టీబీ రిపోర్టు 2019 నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 27 లక్షల టీబీ కేసులున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2025 నాటికి ఇండియాను క్షయరహిత దేశంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 13 రాష్ట్రాల్లో 2017తో పోల్చుకుంటే 2018నాటికి టీబీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2017లో 21.5 లక్షల మంది టీబీ రోగులుండగా.. ఏడాదికల్లా వారి సంఖ్య 27 లక్షలకు చేరింది. మొత్తం కేసుల్లో మూడింట రెండు వంతుల మంది పురుషులే ఉన్నారు. దేశంలో అత్యధిక టీబీ కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. 4.2 లక్షల మంది ఆ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నారు. దేశంలోని మొత్తం కేసుల్లో ఐదోవంతు యూపీలోనే నమోదు కావడం గమనార్హం. వతెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 2ు కేసులతో తెలంగాణది 14వ స్థానం కాగా, 4ు కేసులతో ఏపీ పదో స్థానంలో ఉంది. నిక్షయ్‌ పోషణ్‌ యోజన పథకం కింద క్షయ రోగుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నెలకు రూ.500 జమ చేస్తున్నారు. నిరుడు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది టీబీ రోగులకు రూ.240 కోట్లు ఇచ్చినట్లు ఆ నివేదికలో పేర్కొంది.

Courtesy Andhrajyothi..

 

RELATED ARTICLES

Latest Updates