సీపీఎం, జనసేన ఆందోళన
జీలుగుమిల్లి : గిరిజన గ్రామాల్లో 108 వాహనం అందుబాటులో ఉండాలని సీపీఎం, జనసేన పార్టీలు ఆందోళన చేశారు. రాచన్నగూడెంలో వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో లేక సకాలంలో 108 వాహనం రాకపో వడం వల్ల గిరిజనుడు కొర్స రాజు మృతి చెందాడని ఆయా పార్టీల నేతలు పీహెచ్సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు సీహెచ్.సీతారామయ్య, జనసేన నాయకులు వీరంకి వెంకటేశ్వరావు పలువురు గిరిజనులు పాల్గొన్నారు.